ఏ సంస్థలైనా సర్వేలు జరుపుకోవచ్చు : డిఐజీ పాలరాజు

Update: 2019-01-25 11:32 GMT

ప్రజల మనోభావాలు తెలుసుకునేందుకు ఏ సంస్థలైనా సర్వేలు జరుపుకోవచ్చని విశాఖపట్నం రేంజ్ డిఐజీ పాలరాజు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా కుమిలి గ్రామంలో సర్వే పై చెలరేగిన వివాదం నేపథ్యంలో పాలరాజు స్పందించారు. సర్వే చేసిన వారి నుంచి టాబ్స్, ల్యాప్‌టాప్‌లు బలవంతంగా లాక్కోవడం, వారిపై దాడులకు పాల్పడడం, దౌర్జన్యం చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించేవారిపై చర్యలు తప్పవని పాలరాజు హెచ్చరించారు.

Full View

Similar News