ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఉత్తమ్ అభినందనలు

Update: 2019-02-26 10:56 GMT

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దుల్లోని జేషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్‌ దాడులు చేసిన భారత ఎయిర్‌ఫోర్స్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఐఏఎఫ్‌ ఎంసీసీ ఫైటర్‌ మాజీ పైలెట్‌గా తనకు గర్వంగా ఉందన్నారు. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోకుండా పాక్‌ మద్దతు ఇస్తోందని ఆయన విమర్శించారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు తావు లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ దాడులు మరింత ముందుకు తీసుకుపోయి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

Full View

Similar News