బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి..?

Update: 2019-03-26 06:45 GMT

టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి సొంత పార్టీకి షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఎంపీ సీటు ఇవ్వకపోడంతో ఆగ్రహంగా ఉన్న జితేందర్ రెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. నిన్న రాత్రి బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్‌తో జితేందర్ రెడ్డి హైదరాబాద్‌లో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారడానికి జితేందర్ రెడ్డి మూడు షరతులు పెట్టినట్టు బీజేపీ వర్గాల సమాచారం. రాజ్యసభ సీట్ పై హామీ లభించనట్టు తెలుస్తుంది.  అన్ని బీజేపీ అధిష్టానం ఒకే చేస్తే ఈ నెల 29న మహబూబ్‌నగర్ లో జరిగే ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార సభలో జితేందర్ రెడ్డి బీజేపీలో చేరే ఆకాశం ఉంది.

Similar News