యాదాద్రిలో పోలీస్ వాహనం దూసుకెళ్లిన ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రణతి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఎల్.బి.నగర్లోని కామినేని ఆస్పత్రిలో చిన్నారికి వైద్యచికిత్సలు అందిస్తున్నారు. అయితే, చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. చిన్నారి పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని, విషమంగానే ఉందని చెప్పారు. వెంటిలేటర్పై ఉంచామని, మంచి స్పెషలిస్ట్లతో వైద్యం అందిస్తున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదన్నారు. బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టిందని, సర్జరీ చేసినా కూడా ఎలాంటి మార్పులేదని తెలిపారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తండ్రి మల్లేష్ కన్నీరుమున్నీరుగా విలపించారు.