ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఫ్యాన్ దూసుకుపోయిన విషయం తెలిసిందే. నిన్న 30-05-2019 గురువారం రోజునా నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విసయం తెలిసిందే. ఇక వైసీపీలో మంత్రి పదువులపై తాజాగా వైసీపీ నాయకుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి స్పందించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్కు మంత్రి పదవి రావడం ఖాయమని ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేర్కొన్నారు. మర్రి రాజశేఖర్తో వైసీపీ నాయకులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోదుగుల వేణుగోపాలరెడ్డి గురువారం పట్టణంలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే మర్రి రాజశేఖర్కు మంత్రి పదవి కూడా ఇస్తానన్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనతో చెప్పారని నాయకులు, కార్యకర్తల సమక్షంలో హామీ కూడా ఇచ్చారు. ఈ సంద ర్భంగా ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా నుంచి నిజాయతీ పరులైన ఆళ్ల రామకృష్ణారెడ్డికి, మర్రి రాజశేర్లకు ఖచ్ఛితంగా మంత్రి పదవులు వరించడం ఖాయమని తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మర్రి అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు.