ఈ నెల 30న ఢిల్లీకి ఏపీ, తెలంగాణ సీఎంలు

Update: 2019-05-27 07:11 GMT

ఏపీ, తెలంగాణ సీఎంలు వై.ఎస్. జగన్, కేసీఆర్ ఈ నెల 30న ఢిల్లీ వెళ్లనున్నారు. భారతదేశ ప్రధానిగా నరేంద్రమోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనుండటంతో వైఎస్ జగన్, కేసీఆర్ హాజరుకానున్నారు. అదేరోజు ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న కేసీఆర్ అక్కడి నుంచే నేరుగా ఇద్దరు సీఎంలు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి ఒకే విమానంలో వెళ్లనున్నారు. ఇక తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఇంకా పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల వాటా అంశాలు ప్రధాని నరేంద్ర మోడీతో ఇద్దరు సీఎంలు ఒకే వేదికపై కూర్చోని చర్చించనున్నారు. అలాగే ఆయా శాఖల ద్వారా సమస్యలు పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఘర్షణ వాతావరణంతో చంద్రబాబు వ్యవహరిస్తే.. ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారు. 

Similar News