తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఈనెల 6నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరిస్తారు. ఏప్రిల్ 20 నుంచి హాల్టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆన్లైన్లో ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది, మే 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్ష నిర్వహిస్తారు. ఎంసెట్ కు విద్యార్థులు నిమిషం ఆలస్యం అయినా అనుమతి ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు.