టీడీపీకి మరో షాక్‌...వైసీపీలోకి కాకినాడ ఎంపీ...

Update: 2019-03-12 07:28 GMT

టీడీపీకి మరో షాక్‌ తగిలింది. కాకినాడ ఎంపీగా ఉన్న తోట నరసింహం టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. భార్య తోట వాణితో కలిసి వైసీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. 15 ఏళ్లుగా తాము టీడీపీకి సేవ చేసిన తమకు తగిన గుర్తింపు దక్కలేదని తోట వాణి ఆరోపించారు. హోంమంత్రి చినరాజప్ప తమకు అడ్డుపడ్డారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చినరాజప్ప పోటీ చేస్తున్న పెద్దాపురం నుంచి తాను బరిలోకి దిగుతానంటూ తోట వాణి ప్రకటించారు.   

Similar News