సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కారెక్కడం ఖాయమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లోనే అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్లో చేరతారని ప్రచారం జరుగుతోన్న సండ్రకు 19న జరగనున్న కేబినెట్ విస్తరణలోనూ చోటు దక్కనుందని అంటున్నారు. కొద్దిరోజులుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న సండ్రపై తెలుగుదేశం హైకమాండ్ కూడా చర్యలు చేపట్టింది. సండ్ర టీటీడీ సభ్యత్వాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.