టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా.. నేడు వైసీపీలోకి

Update: 2019-03-25 08:55 GMT

ఏపీలో ఎన్నికల వేళ జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలో చేరితే టీడీపీ నుంచి కొంతమంది వైసీపీలో చేరిపోతున్నారు. తాజాగా టీడీపీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు, కాకర్ల రంగనాథ్ ఇద్దరూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా అనంతరం అనుచరులు, ముఖ్య కార్యకర్తలు, కుటుంబీకులతో మంతనాలు జరిపిన తరవాత వైసీపీలోకి చేరాలని గుత్తా వెంకటనాయుడు, కాకర్ల రంగనాథ్ నిర్ణయించుకున్నారు. నేడు సోమవారం వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. 

Similar News