దొంగలంతా వైసీపీ చుట్టూ ఉన్నారని, ఆ పార్టీ అధినేత జగన్ సోదరి షర్మిళ ఉంగరాన్నే కొట్టేశారని ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ సెటైర్లు విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఆలీబాబా 40 దొంగల పార్టీ అని వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహిళలకు ఇస్తున్న పసుపు-కుంకుమను అడ్డుకునేందుకు వైసీపీ యత్నిస్తోందని లంకా దినకర్ మండిపడ్డారు. వైసీపీ నేతలు రాక్షసానందాన్ని పొందుతున్నారని, నీచ రాజకీయాల కోసం ఫ్యాక్షన్ని పెంచిపోషిస్తున్నారని లంకా దినకర్ తీవ్ స్థాయిలో విమర్శించారు.