వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన దివ్యవాణి

Update: 2019-03-25 13:55 GMT

ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటు అధికార పార్ఠీ టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా వైసీపీ టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుషులు ఫ్యాన్‌కి ఉరేసుకుంటే ఒక్క ప్రాణమే పోతుందని, అదే ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే అందరి ప్రాణాలు పోతాయని దివ్యవాణి వ్యాఖ్యానించారు. అసలు ఏపీపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని కాదని అలీ వైసీపీలో చేరడం వెనుకన్న కారమేంటి? అని ప్రశ్నించారు. ఆస్తుల్ని లాక్కుంటామని అలీని కేసీఆర్ ఏమైనా బెదిరించారా అని అన్నారు. 

Similar News