దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. కాగా ఇప్పటి వరకు ఏపీలో 30 శాతం పొలింగ్ నమోదు అయింది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర హిందుపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకొవడం చాలా సంతోషంగా ఉందని పెర్కొన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యలో ఓటర్లు తమ అభిష్టం మేరకు ఓటు వేయాలన్నారు. తమ ఓటు కుటుంబంతో పాటు వచ్చి ఆయన ఓటు వేశారు. ఇప్పటికే తమ హక్కును వినియోగించుకునేందుకు సినీ తారాలు, ప్రముఖ రాజకీయ వేత్తలు తమ ఓటును వేశారు. ఇంకా పొలింగ్ కొనసాగుతొంది.