నెల్లూరు జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఎర్రచందనం అక్రమార్కుల స్థావరాలే లక్ష్యంగా అర్ధరాత్రి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వెంకటగిరి ప్రాంతం నుంచి చైన్నై తరలించేందుకు సిద్ధంగా ఉన్న విలువైన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కొందరు ఎర్రచందనం స్మగ్లర్లు, దుండగులను అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి జరిగిన మెరుపు దాడుల విషయాన్ని పోలీసులు రహస్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.