ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై వేసిన రివ్యూ పిటీషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలంటూ 21 పార్టీలు రివ్యూ పిటీషన్ వేశాయి. అయితే విచారణకు స్వీకరించిన ధర్మస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలంటే వారం పడుతుందని స్పష్టం చేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను మార్చాలనే ఉద్దేశ్యం తమకు లేదని తేల్చిచెప్పింది.