తమ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే నెగ్గుతుందో రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారాన్ని దక్కించుకునే ప్రశ్నేలేదు అని కొన్ని నియోజకవర్గాలు వారు చెబుతారు. అయితే తమ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే నెగ్గితుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడుతుందని మరికొన్ని నియోజకవర్గాల వారు చెబుతారు. అలాంటి 'సెంటిమెంటల్' ఓ నియోజకవర్గ విజయాల గురించి ఆసక్తిదాయకమైన ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఆ నియోజకవర్గమే శింగనమల. శింగనమలది పాజిటివ్ సెంటిమెంట్! వైసీపీ అనంతపురం జిల్లాలో నెగ్గగల నియోజకవర్గాల్లో ముందు వరసలో వినిపిస్తోంది శింగనమల నియోజకవర్గం పేరు.
కాగా శింగనమల నియోజకవర్గం మరోసారి సెంటిమెంట్ను రుజువు ఫ్రఫ్ చేసింది. శింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే గెలుపొందుతారో ఆ పార్టీ అభ్యర్థి అధికారంలోకి రావడం ఇక్కడ సెంటిమెంట్గా సాగుతోంది. గత 7 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందితే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. ఈ ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి జయకేతనం ఎగురవేశారు. దీంతో పద్మావతి విజయం వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. దీంతో శింగనమల సెంటిమెంట్ను మరోసారి రుజువు చేసింది. ఈ లక్కీ నియోజకవర్గంలో ఇలా వైఎస్సార్సీపీ జెండా రేపరేపలాడింది.