పుల్వామా ఉగ్రదాడికి ప్రతిదాడితో భారత్ ప్రతీకారం తీర్చుకొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మిరాజ్ ఫైటర్ యుద్ధవిమానాల దళంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి 245 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. పీఓకేలో వైమానిక దాడులు చేయడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. వైమానికి దాడులు చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్లకు శాల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. ఎయిర్ ఫోర్స్ పైలెట్లు అర్థరాత్రి వేళ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ బాంబు దాడులు చేశారని కొనియాడారు. ఇదే తరహాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యశ్వంత్ సిన్హా పలువురు రాజకీయ, సినీ హీరోలు ప్రశంసలు కురిపిస్తున్నారు.