సేలబ్రేటిస్ సాధారణ వ్యక్తిలా ఉండడం అనేది చాలా వరకు కష్టమే .. ఇలాంటివి మనం సినిమాల్లో తప్ప మరెక్కడా చూడలేం .. టాలీవుడ్ యాంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రం ఓ సాధారణ వ్యక్తిలా రోడ్ల పై హైదరాబాదులో తిరిగేసారు .. ప్రయాణికులతో కలిసి ఆటోలు, బస్సులు, మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఆశ్చర్యం కలిగించారు. ట్రిపుల్ రైడ్ చేస్తూ బైక్పై చక్కర్లు కొడుతూ సందడి చేశారు. సికింద్రాబాద్ బస్టాప్ వద్ద బస్సులో కిటికీ వైపు కూర్చుని సెల్పీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ తన జర్నీ అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. భాగ్యనగరంలో సాధారణ వ్యక్తిలా తాను కూడా ట్రావెల్ చేశానని చెప్పారు...
Few people travel via share autos, some go by bus, some on bikes and the latest mode is the Hyderabad Metro. I played the role of a daily commuter as we recreated the various scenarios for this photo series #bestexperience
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) June 11, 2019
Concept & Photography by #kishorkrishnamoorthi pic.twitter.com/EsTyfRwfEc