జబర్దస్త్ కి రోజా గుడ్ బై ... ?

Update: 2019-05-25 08:19 GMT

తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయిన షో జబర్దస్త్.. వారంలో రెండు రోజులు వచ్చే ఈ షో కి మంచి క్రేజ్ ఉంది .. షో మొదలు నుండి నాగబాబు మరియు రోజాలు మాత్రమే న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు .. మొన్నటివరకు షో కి మంచి రెస్పాన్స్ వచ్చేది . కానీ ఎన్నికల సమయంలో రోజా, నాగబాబు పోటి చేయడంతో షో కి కొంచం క్రేజ్ తగ్గింది అనే చెప్పాలి .. అయితే ఈ షో కి త్వరలో రోజా గుడ్ బై చెప్పనున్నారు అని తెలుస్తుంది ..

నగిరి నియోజకవర్గ ఎమెల్యేగా తిరిగి రెండోసారి ఎన్నికైన రోజాకి వైసీపీ లో మంత్రి దక్కే అవకశాలు ఉన్నాయని తెలుస్తుంది . దీనితో ఆమె జబర్దస్త్ షో కి పూర్తిగా వదిలేస్తున్నారు అని టాక్ .. ఇన్నాళ్లు ఇటు రాజకీయాల్ని, అటు జబర్దస్త్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన రోజాకి మంత్రి పదవి వస్తే చాలా బిజీగా ఉండాల్సి వస్తుంది ..

ప్రస్తుతం వైసీపీ మహిళా రాజకీయ నాయకుల్లో రోజానే కీలకమైన వ్యక్తి. పైగా జగన్ కి బాగా సన్నిహితురాలు కూడా. కాబట్టి జగన్ పెద్ద బాధ్యతనే ఈమె బుజాలపైనా వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజా జబర్దస్త్ అని కూర్చుంటే కుదరదు కదా! అందుకే ఆమె జబర్దస్త్ వదలక తప్పదు అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు రోజా తప్పుకుంటే జ‌బ‌ర్దస్త్ కామెడీ షో పరిస్థితి ఆగమే అనే వారూ కూడా ఉన్నారు. 

Similar News