రోజా గెలిస్తే జగన్ సీఎం కాలేరన్న వారందరికీ నా విజయం చెంప పెట్టు లాంటిదని రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఆమె రెండోసారి వరుసగా గెలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజన్న పాలనలో మాదిరిగా జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారు. అనేక సంక్షేమ పథకాలతో అందరూ సుఖంగా ఉంటారని హామీ ఇస్తున్నా. నేను ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తా'' అని రోజా అన్నారు.