ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆర్ కృష్ణయ్య
తెలంగాణ పంచాయతి ఎన్నికలపై స్టే విధించాలంటూ కాంగ్రెస్ నేత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ పంచాయతి ఎన్నికలపై స్టే విధించాలంటూ కాంగ్రెస్ నేత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. 34 శాతంగా ఉన్న బీసీల రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి విడుదల కాబోయే పంచాయతి ఎన్నికల నోటిఫికేషన్పై స్టే విధించాలంటూ ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు.