నరసరావుపేట ఎంపీ టిక్కెట్టును రాయపాటి సాంబశివరావుకు టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు సమాచారం టీడీపీ హై కమాండ్ నుంచి రాయపాటికి అందింది. అయితే, నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్టు కోసం డాక్టర్ అరవిందబాబు పేరును అధిష్టానం పరిశీలిస్తోంది. బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో అరవిందబాబు వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది. స్థానికంగా మాత్రం అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి.