తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 22వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్, సుహాసిని, సినీ దర్శకుడు క్రిష్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఆయన తనయుడు బాలకృష్ణ కొనియాడారు. ఎంతమంది ఎన్ని పార్టీలు పెట్టిన ఎన్టీఆర్ కు సాటివచ్చే వచ్చే నాయకుడు లేడని చెప్పారు. సినిమాల్లో ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా పూర్తిగా న్యాయం చేసేవారని బాలకృష్ణ తెలిపారు.