అంతరిక్ష రంగంలో సత్తా చాటాం: మోడీ

Update: 2019-03-27 07:52 GMT

అంతరిక్ష రంగంలో భారత్ సత్తా చాటిందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన అంతరిక్ష రంగంలో మనం 4వ స్థానంలో ఉన్నామని, అమెరికా, చైనా, రష్యా సరసన చేరామని చెప్పారు. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినమైన ఆపరేషన్ అని, అంతరిక్షంలో ఎన్నో శాటిలైట్లను కూల్చేసినట్టు తెలిపారు. యుద్ధ వాతావరణం సృష్టించడం భారత్ ఉద్దేశం కాదన్న మోడీ డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను అభినందిస్తున్నామన్నారు. 

Similar News