వైఎస్‌ జగన్‌ వెంటే మైనార్టీలు: నటుడు అలీ

Update: 2019-05-30 08:22 GMT

ఏపీలోని మైనార్టీలంతా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటారని సినీ నటుడు, వైసీపీ నేత అలీ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా యెడుగూరి సందింటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అలీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించడం అద్భుతమన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రజలు పూర్తి నమ్మకముంచారన్నారు. అందుకే తిరుగులేని భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించారని అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలీ వైసీపీ తీర్థంపుచ్చుకున్న విషయం తెలిసిందే.

Similar News