ఇంటర్ ఫలితాలపై ఆందోళనలు వద్దన్నారు విద్యాశాఖ మంత్రి జగదీష్రెడ్డి. కమిటీ నివేదిక వచ్చాక దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇంటర్ ఫలితాలపై ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులను, తల్లిదండ్రులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయన్నారు.