మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2013 నుంచి మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతోన్న సుధాకర్పై కోటి రూపాయల రివార్డు ఉంది. సుధాకర్ తన భార్య మాధవితో కలిసి రాంచీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్కి చెందిన సుధాకర్ అలియాస్ కిరణ్ జార్ఖండ్ మావోయిస్ట్ కార్యక్రమాల్లో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించాడు. పోలీసుల ఎదుట లొంగిపోయిన సుధాకర్, అతని భార్య మాధవిని తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.