నన్ను తప్పుపట్టడం సరికాదు: ఎల్వీ సుబ్రహ్మణ్యం

Update: 2019-05-17 04:10 GMT

చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఖండించారు. రీ పోలింగ్‌ విషయంలో తనను తప్పుబట్టడం సరికాదని ఆయన అన్నారు. చంద్రగిరిలో నియోజకవర్గంలోని 7 గ్రామాల్లో దళితులు ఓట్లు వేయలేదని తమకు ఫిర్యాదు అందిందని సీఎస్‌ చెప్పారు. ఫిర్యాదులో తీవ్రత ఉన్నందునే తాము ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చూడటం అధికారులుగా తమ బాధ్యతన్నారు. తాము చేసిన ఫిర్యాదుపై సాక్ష్యాలు చూసి, నిర్ణయం తీసుకునేది ఎన్నికల సంఘమేనని చెప్పారు. రీ పోలింగ్‌ విషయంలో అధికారులను తప్పుపట్టడం సరికాదని సీఎస్‌ తెలిపారు. పాలన గుడ్డిగా సాగే పరిస్థితి రానివ్వకూడదన్నారు. 

Similar News