ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా ఏపీ మినహా తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో విడుదలై టాప్ గెర్ లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. కాగా అధికారం కోసం తన సొంతమామకు బాబు చేసిన ద్రోహాన్ని ఈ సినిమాలో వర్మ పర్ఫెక్ట్గా చూపించారని ప్రేక్షకులు చెప్తున్నారు. ఇక పలు అవాంతరాల అనంతరం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కావడం, విజయవంతంగా ప్రదర్శితమవుతుండటం పట్ల వైసీపీ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆనందం వ్యక్తం చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్తో తన గుండెమంట చల్లారిందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం తెగించి వీధి స్థాయి నాయకుడిగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలును మరచిపోయి నందమూరి బాలకృష్ణ ప్రవర్తిస్తున్నారని, బాలకృష్ణ ఇంటినుంచే షర్మిలపై దుష్ప్రచారం జరగడం బాధాకరమన్నారు లక్ష్మీ పార్వతి.