సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థులు వలసల బాట పడతున్నారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజీమానా యోచనలో ఉన్నారు. ఆయన వైసీపీ తరుపున ఎం.పీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈరోజు లేదా రేపు బైరెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేస్తారని తెలిసింది. నిన్నహైదరాబాద్లో డీసీసీ పదవి కోసం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో బైరెడ్డి విబేధించారు.