తాజాగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ భారీ మెజరిటీతో విజయకేతనం ఎగురవేస్తుందని దీమా వ్యక్తం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే అత్యధిక మెజరిటీలో మొదటి స్థానంలో మెదక్, రెండో స్థానంలో వరంగల్, ఇక మూడు లేదో నాలుగో స్థానంలో నిలుస్తాయన్నారు కేటీఆర్. ఆదివారం కేటీఆర్ మీడియా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలను మరింత ఉత్తేజపరచడానికే తన భావ హరీశ్ రావుతో సరదాగా ఛాలెంజ్ విసిరానని చెప్పారు. మెదక్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాక అని, అక్కడ కచ్చితంగా టీఆర్ఎస్కు భారీ మెజారిటీ వస్తుందన్నారు.
ఇక ఏపీ రాజకీయాలపై కూడా కేటీఆర్ ప్రస్తవించారు. ఆ రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం మారిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజల పట్ల నమ్మకం లేకనే ఆయన ఢిల్లీలో నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పును స్వాగతించాలి కానీ చంద్రబాబులా గగ్గోలు పెట్టొద్దన్నారు.