నరసాపురం అసెంబ్లీ టిక్కెట్ కేటాయించలేదన్న మనస్తాపంతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం సీటు ఆశించి భంగపడ్డారు. దీంతో ఇప్పుడు తాజాగా టీడీపీకి కూడా రాజీనామా చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో రెబల్గా ఎన్నికల బరిలోకి దిగాలని పలువురు సూచించారు. అయితే రెబల్గా బరిలోకి దిగే విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోని కొత్తపల్లి సుబ్బారాయుడు, నేటి సాయంత్రంలోపు తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.