ఇంటర్ బోర్డు అవకతవకల వ్యవహారంలో ప్రభుత్వ తీరు సరిగాలేదని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు కోదండరామ్ విమర్శించారు. ఇంటర్ బోర్డు రద్దు చేస్తాననడం సరైన పద్ధతి కాదన్నారు. గ్లోబరీనాపై చర్యలు తీసుకుని విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కోదండరామ్. ఇంటర్బోర్డు వ్యవహారంలో ప్రభుత్వం హైకోర్టును తప్పుదారి పట్టించారని కోదండరామ్ ఆరోపించారు. ఇంటర్ బోర్డు తీరుపై అఖిలపక్ష నేతలమంతా గవర్నర్ను కలుస్తామని ఆయన చెప్పారు.