శబరిమలపై కమ్యూనిస్టు సర్కార్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది

శబరిమల విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ.

Update: 2019-01-06 10:46 GMT

శబరిమల విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ.సుప్రీంకోర్టు తీర్పును ఎవరూ వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. కేరళ ప్రభుత్వమే బలవంతంగా ఇద్దరు మహిళలను ఆలయంలోకి పంపిందని ఆరోపించారు. విజయన్ ప్రభుత్వంభక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పవని దత్తాత్రేయ అన్నారు. కమ్యూనిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడానికే శబరిమలలో హింసను ప్రేరేపిస్తున్నారని దత్తాత్రేయ ఆరోపించారు.

Similar News