త్వరలో కొత్త రెవిన్యూ, మున్సిపల్ చట్టాలు: కేసీఆర్

Update: 2019-06-02 04:50 GMT

హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో సీఎం పాల్గొన్నారు. పతాకావిష్కరణ అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తూ తెలంగాణ యావన్మందికి రాష్ట్ర ఆవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థల పనితీరు మెరుగుకు పంచాయతీరాజ్ చట్టం తెచ్చినట్లు చెప్పిన కేసీఆర్.. స్థానిక సంస్థలకు ఏటా రూ.2 వేల కోట్లకు పైగా నిధులు అందుతాయన్నారు. త్వరలో కొత్త రెవిన్యూ, మున్సిపల్ చట్టాలను తీసుకొస్తామన్నారు కేసీఆర్. పాలనలో జవాబుదారీతనం కోసం ఈ చట్టాలను తెస్తున్నట్లు తెలిపారు. అవినీతిని పారద్రోలితే పాలన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండకూడదన్నారు.  

Similar News