కత్తి మహేష్‌ ఎన్నికల ప్రచారం

Update: 2019-04-02 09:31 GMT

ఎన్నికల పోలింగ్‌కు కొద్దిరోజులు మిగిలి ఉంది. కాగా ఇప్పటికే పులువరు సినీ గ్లామర్ వైసీపీ తీర్ధంపుచ్చకున్న విషయం తెలిసిందే కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ కూడా వైసీపీ తరుఫున ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కత్తి మహేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంతో ఏ వర్గాలకూ న్యాయం జరగలేదని అన్నారు. ఎస్సీలను టీడీపీ కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుందని, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని, మనమంతా వైసీపీకి అండగా ఉండాలన్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలంలోని గోళ్ళపాడు, ముప్పాళ్ళ గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో సోమవారం వైసీపీకి మద్దతుగా కత్తిమహేష్ ప్రచారం నిర్వహించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. 

Similar News