ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీడీపీ నాయకుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజు వైసీపీలో చేరనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువా మార్చుకోనున్నారు. నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వారం క్రితమే ప్రకటించిన రఘురామ కృష్ణంరాజు అంతలోనే టీడీపీకి షాక్ ఇచ్చి జగన్ పార్టీలోకి వెళ్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి పార్లమెంట్ కు పోటీ చేయనున్నారు. గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లగా ఇప్పుడు మళ్లీ పార్టీ మారుతున్నారు.