ఏపీకి ప్రధాని మోడీ చేసిన మేలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరన్నారు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. దేశ ప్రతిష్టను దశదిశలా తీసుకెళ్తున్న ప్రధాని ప్రాజెక్టులు గ్రాంటులు సంక్షేమ పథకాల రూపంలో ఏపీకి ఎన్నో పనులు చేశారన్నారు. చారిత్రాత్మకమైన పోలవరం నిర్మాణానికి వంద శాతం నిధులు ఇచ్చి రాష్ర్టానికి ఇచ్చిన గిఫ్ట్ ను మరచిపోలేమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రైతుల నోట్లో మట్టికొట్టి భూములు లాక్కున్నారని ఆరోపించారు.