పవన్‌పై పోటీ గురించి పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Update: 2019-03-23 10:20 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే కాగా తాజాగా పవన్ పై పలు కీలక వ్యాఖ్యాలు చేశారు. మొదట జనసేనాని పాలకొల్లు నుండి ఎన్నికల బరిలో దిగుతారని ప్రకటించాడని అయితే తాను కూడా అక్కడి నుండే పోటీకి దిగుతున్నానని తెలిసేసరికి అక్కడి నుండి భీమవరానికి పారిపోయాడని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. అయితే మళ్లీ తాను కూడా భీమవరం నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని కేఏ పాల్ అన్నారు. కాగా పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరు తన తమ్ముళ్లే అని చెప్పుకొచ్చారు. కేవలం వారి మీద ఉన్న ప్రేమ, అభిమానంతోనే తాను పోటీ చేస్తున్నాని అన్నారు. పవన్ కళ్యాణ్‌కి ఓట్లు లేకపోయినా సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిశారని పాల్ విమర్శించారు. తమకు ప్రతి ఊరిలో వందలో 60 నుంచి 70 ఓట్లు ఉన్నాయని అందరికీ తెలుసన్నారు.

Similar News