కేఏ పాల్ నామినేషన్లు ఓకే.. పాల్ ఎమన్నడంటే..

Update: 2019-03-26 10:53 GMT

సోమవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. అయితే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ నామినేషన్ అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. భీమవరంలో నామినేషన్ సమయం అయిపోయిన తరువాత వచ్చిన పాల్ నామినేషన్ తిరస్కరించారు కాగా నేడు మంగళవారం నరసాపురం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు కేఏ పాల్ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఓకే చేశారు. దీనిపై కేఏ పాల్ స్పందిస్తూ తన నామినేషన్ తిరస్కరించేలా వైసీపీ నేత విజయసాయి రెడ్డే కట్రపన్నానని పాల్ ఆరోపించారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటేస్తే అవినీతిని మనమే సమర్ధించినట్లేనని పాల్ అన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఓటేస్తే గ్లాసు పగిలిపోయినట్లేనని, అసలు పవన్ కళ్యాన్‌కి ప్రజాసేవ చేసే ఉద్దేశ్యమే లేదని అన్నారు. తన పార్టీని గెలిపిస్తే మాత్రం ఒక్క ఏడాదిలోనే నరసపురంని అమెరికాలా అభివృద్ధి చేస్తా అన్నారు కేఏ పాల్. 

Similar News