నేడు మాజీ సీఎం, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా ఎన్టీయార్ ఘాట్ వెలవెలబోయింది. పూలతో కలకలలాడాల్సిన తాత సమాధి కల తప్పడంతో జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ అసహనం వ్యక్తం చేశారు.కారు దిగి సమాధి వద్దకు రాగానే అక్కడి పరిస్థితిని చూసి కంగుతిన్నారు తిన్నారు. వెంటనే పుష్పాలను తెప్పించి జూ. ఎన్టీఆర్ స్వయంగా తాత సమాధిని అలంకరించారు. అక్కడే ఉన్న అభిమానుల సాయంతో సమాధి మొత్తం పూలతో కలకలలాడేలా చేశారు. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ తెల్లవారుజామున 5.30గంటలకు ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. తాతతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని తారక్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని జూనియర్ ఎన్టీయార్ ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.