పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన వైమానిక దాడులపై విదేశాంగ శాఖ కార్యదర్శి వీకే గోఖలే ప్రకటన చేశారు. ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే లక్ష్యంగా వైమానిక దాడులు విజయవంతంగా పూర్తి చేశామని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వివరించారు. ఎత్తైన కొండలు, అటవీ ప్రాంతంలో గురి తప్పకుండా లక్ష్యాలను చేధించినట్టు ఆయన తెలియజేశారు. ఈ ఘటనలో పౌరులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రకటించారు . పుల్వామా ఉగ్ర దాడికి పాల్పడ్డ వారిపై ప్రతీకారం తీర్చుకున్నామంటూ ఆయన తెలియజేశారు.