పవన్ కళ్యాణ్ కొత్త ప్రణాళిక: క్షేత్ర ఫర్ జనసేన ..

త్వరలో రానున్న ఎన్నికలకు జనసేన పార్టీ దూకుడు పెంచుతోంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలోని జిల్లాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Update: 2019-01-09 09:30 GMT

త్వరలో రానున్న ఎన్నికలకు జనసేన పార్టీ దూకుడు పెంచుతోంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలోని జిల్లాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పడు పార్టీని మరింత బలోపితం చేయాడానికి మరో ముందడుగు వేస్తుంది. ఇప్పడు గ్రామస్థాయిలో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా దృష్టి సారించింది జనసేన. కాగా దీనిలో భాగంగా క్షేత్ర ఫర్ జనసేన టీమ్‌లను ఏర్పాటుచేయనున్నట్లు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గ్రామస్థాయిల్లో ప్రజలతో మమేకమై జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రచారం చేయడమే క్షేత్ర ఫర్ టీమ్‌ల లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా గ్రామస్థులతో ఆత్మీయ సమావేశాలను కూడా క్షేత్ర ఫర్ జనసేన సభ్యులు నిర్వహిస్తారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

Similar News