నిన్న జనసేన.. నేడు బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్‌

Update: 2019-03-25 14:08 GMT

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలో చేరితే టీడీపీ నుంచి కొంతమంది వైసీపీలో చేరిపోతున్నారని తెలిసిందే కాగా ఇటివలే ఏలూరు రేంజ్‌ డీఐజీగా పదవీ విరమణ చేసి జనసేన పార్టీలో దిగారు రవికుమార్‌ మూర్తి. అయితే తన సొంత ప్రాంతమైన తిరుపతి నుండి ఎంపీ సీటు కోసం ఆశపడ్డాడు రవికుమార్‌ మూర్తి.

కానీ తిరుపతి సీటు దక్కపోవడంతో కొంత అసంతృప్తితో ఉన్న రవికుమార్‌ మూర్తిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనతో బీఎస్పీ అభ్యర్గిగా కొవ్వూరుకు మారారు. అయితే బీఎస్పీతో పొత్తులో భాగంగా ప.గో జిల్లా కొవ్వూరు సీటును జనసేన బీఎస్పీకి కేటాయించిన సంగతి తెల్సిందే. అయితే నిన్నటి వరకు గాజు గ్లాసు గుర్తులో తిరిగిన రవికుమార్ ఒక్క రోజులోనే కండువా మార్చి బీఎస్పీ అభ్యర్థిగా సోమవారం రవికుమార్‌ మూర్తి నామినేషన్‌ దాఖలు చేశారు. 

Similar News