జనసేనకు కీలక నేత గుడ్ బై.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక

Update: 2019-03-24 08:50 GMT

ఏపీలో ఎన్నికల వేళ పెరిగిపోతున్న జంపింగ్ జిలానీ ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతున్న జిలానీలు వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి టీడీపీ నుంచి మరికొందరు వైసీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీల్లోని అసంతృప్త నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనలో చేరిన కొద్దిరోజులకే కొందరు నేతలు గుడ్‌ బై చెప్పేసి బయటికొచ్చేస్తున్నారు. కాగా తాజాగా జనసేనలో చేరిన దేవినేని మల్లిఖార్జున రావు అసంతృప్తికి రాజీనామా చేసి బయటికొచ్చేశారు. ఆదివారం దేవినేని మల్లికార్జురావు వైసీపీ గూటికి చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు జగన్. వారం రోజుల్లో ఈయన రెండు పార్టీలు మారడం గమనార్హం. పామర్రు టికెట్ దక్కకపోవడం వల్ల అసంతృప్తితో వైసీపీలో చేరారు. 

Similar News