వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరయ్యింది. కోడికత్తితో జగన్ పై హత్యాయత్నం కేసులో బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానంలో వాదనలు ముగియగా, నిందితుడు శ్రీనివాస్ కు ఎన్ఐఎ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దీంతో మరో రెండు రోజుల్లో నిందితుడు శ్రీనివాస్ విడుదలకానున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉణ్న శ్రీనివాస్, వైజాగ్ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడి చేయగా, సంఘటనా స్థలంలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సెల్ఫీ తీసుకునే సాకుతో జగన్ వద్దకు వెళ్లిన నిందితుడు శ్రీనివాస్ కోడి కత్తితో దాడిచేయగా, జగన్ భద్రతా సిబ్బంది వెంటనే గమనించి ఆయనను తప్పించారు.