తిరుమలకు పోటెత్తిన భక్తులు

Update: 2019-05-12 03:42 GMT

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారాంతంతోపాటు సెలవులు ఉండటంతో పెద్ద సంఖల్యో భక్తులు ఏడుకొండలు ఎక్కారు. క్యూ కాంప్లెక్సుల్లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి కిలోమీటర్‌ మేర క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం 24 గంటల వరకు సమయం పడుతోంది. ఇటు దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైమ్ స్లాట్‌ దర్శనాలు కూడా సుమారు 7 గంటల వరకు వేచిచూడాల్సి వస్తోంది. మరోవైపు వేసవి రద్దీ కొనసాగుతుండటంతో ముందుజాగ్రత్తగా టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. 

Similar News