తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటివల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచిన చంద్రశేఖర్ రావు. ఎన్నికల అఫిడవిట్లో మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిటిషన్ దాఖలైంది. కాగా సీఎం కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్లో మాత్రం కేసీఆర్ కేవలం నాలుగు అంటే నాలుగే కేసులు చూపారని పిటీషన్లో పెర్కోన్నారు. కాగా కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్కు చెందిన శ్రీనివాస్ అనే ఓటర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించాలని శ్రీనివాస్ హైకోర్టుని కోరారు. ఇక ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయస్థానం సీఎం కేసీఆర్కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేవలం నాలుగు వారాల్లోనే వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.