ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు వెల్లువలా జనం వైసీపీ గూటికి చేరుతున్నారు. తాజాగా యువ హీరో తనీష్ వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. హీరో తనీష్ ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇటివలే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బుట్టా రేణుక, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.