సికింద్రాబాద్ రైల్వే విభాగంలో నకిలీ మెడికల్ బిల్లుల స్కామ్ వెలుగు చూసింది. నకిలీ బిల్లులు సృష్టించి రెండు కోట్ల 20 లక్షలు స్వాహా చేసినట్టు గుర్తించారు. గతేడాది అక్టోబర్-ఏప్రీల్ మధ్య 31 నకిలీ మెడికల్ బిల్లులు సమర్పించినట్టు రైల్వే విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ కేసులో రైల్వే అకౌంట్స్ అసిస్టెంట్స్ వి.గణేష్కుమార్, సాయిబాలాజీతో పాటు నకిలీ మెడికల్ బిల్లులు ఇచ్చిన వినాయక ఏజెన్సీస్, తిరుమల ఎంటర్ ప్రైజెస్పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.